ద్రవ్య బిల్లు అంటూ ఆపడం సరికాదు : ఆజాద్‌

636060078230949752న్యూఢిల్లీ : కేవీపీ ప్రైవేటు మెంబర్ బిల్లుపై ఇంతకముందే చర్చించామని…కేవలం అమలు చేయడమే మిగిలిందని కాంగ్రెస్ నేత గులాంనబీ ఆజాద్ అన్నారు. ఈ సమయంలో ద్రవ్య బిల్లు అంటూ ఆపడం సరికాదన్నారు. విభజన సమయంలో నాటి ప్రధాని ఇచ్చిన హామీలను అమలు చేస్తారో లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. సమస్యను ఎందుకు మరింత జటిలం చేస్తారని ఆజాద్‌ ప్రశ్నించారు. రాజ్యసభలో ఆజాద్ ప్రసంగించారు.