నగదు బదిలీ పథకాన్ని ప్రారంభించిన సీఎం

చంద్రగిరి : ఆధార్‌ కార్డు ఆధారంగా నగదు బదిలీ పథకాన్ని ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి శనివారం చంద్రగిరిలో ప్రారంభించారు. ఈ పథకం ద్వారా జిల్లాలో 8లక్షల 30వేల మందికి లబ్ధి చేకూరునుంది. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు జైరాం రమేష్‌, కిల్లి కృపారాణి పాటు రాష్ట్ర మంత్రులు గల్లా అరుణకుమారి, పార్థసారథి, సునీతా లక్ష్మారెడ్డి హాజరయ్యారు.