నగరంలో దొంగల బీభత్సం

నిజామాబాద్ అర్బన్ (జనం సాక్షి): నిజామాబాద్ నగరంలో దొంగలు బీభత్సం సృష్టించారు. నగరంలోని గాయత్రి నగర్ సాయి నగర్ లో సత్యనారాయణ అనే వ్యక్తి ఇంట్లో దొంగలు బీభత్సం సృష్టించి సుమారు 15 తులాలకు పైగా బంగారాన్ని దొంగిలించారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం సత్యనారాయణ తన కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ వెళ్ళగా బుధవారం అర్ధరాత్రి దాటాక గుర్తుతెలియని దొంగలు ఇంటి తాళాలు పగలగొట్టి ఇంట్లో బీభత్సం సృష్టించి చోరీకి పాల్పడ్డారు. గురువారం ఉదయం స్థానికులు విషయాన్ని గమనించి బాధితుడికి, పోలీసులకి సమాచారాన్ని అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్లూస్ టీం తో దర్యాప్తు చేపట్టారు. కాగా దుండగులు తమ ఫింగర్ ప్రింట్స్ పడకుండా ప్రతిచోట ఇంట్లోని కర్చీఫ్ లు వాడడం విశేషం