నడిగడ్డ లో షర్మిల ప్రజా ప్రస్థాన యాత్ర….

గద్వాల రూరల్ ఆగస్టు 23 (జనంసాక్షి):-జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల నియోజకవర్గంలో వైఎస్ షర్మిల పాదయాత్ర మంగళవారం ఎమ్మునోముపల్లి స్టే నుంచి ప్రారంభమైంది. రోడ్డు మార్గాన పాదయాత్ర చేస్తూ రోడ్డు వెంట పంటపొలాలో ఉన్న రైతులను వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ వ్యవస్థాపకురాలు వైఎస్ షర్మిలా ఆత్మీయంగా పలకరించారు,ధరూర్ మండల పరిధిలోని భీంపూరం,చిన్నపాడు,పెద్దపాడు, ఈడిగోనిపల్లి,శెట్టి ఆత్మకూరు మీదుగా గద్వాల జిల్లా కేంద్రానికి పాదయాత్ర చేరింది..గ్రామంలో ప్రజలతో మమేకమై మాట ముచ్చట నిర్వహించి ప్రజా సమస్యలను తెలుసున్నారు. పాదయాత్రలో సీఎం కేసీఆర్ పథకాలపై విమర్శలు గుప్పించారు..వైఎస్ షర్మిల కేసీఆర్ పథకాల పేరుతో ప్రతి వర్గాన్ని మోసం చేశారని విరుచుకుపడ్డారు. వైఎస్సార్ ప్రతిపథకాన్ని అద్భుతంగా అమలు చేస్తే..సీఎం కేసీఆర్ వాటిని పక్కన పెట్టాడని వైఎస్ షర్మిల ఆరోపించారు…ఈ కార్యక్రమంలో టి.వైఎస్ఆర్ పార్టీ సీనియర్ నాయకుడు అతికూర్ రెహమాన్,పార్టీ కార్యకర్తలు, నాయకులు ఆయా గ్రామాల ప్రజలు,రైతులు అధికసంఖ్యలో పాల్గొన్నారు..