నర్సంపల్లి గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు

విజేతలకు బహుమతులు ప్రధానం..
ఊరుకొండ, ఆగస్టు 20 (జనం సాక్షి):
ఊరుకొండ మండలం నర్సంపల్లి గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆవరణలో 75వ స్వాతంత్ర్య భారత వజ్రోత్సవాల్లో భాగంగా స్థానిక సర్పంచ్ వాగుల్ దాస్ నిరంజన్ గౌడ్ అధ్యక్షతన మహిళా మణులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ముగ్గుల పోటీలలో చక్కని ప్రతిభ కనబరిచి మొదటి బహుమతి అదిరాల నీలమ్మ రూ.1016/- సొంతం చేసుకోగా, రెండవ బహుమతి పైళ్ల స్రవంతి రూ.516/- సొంతం చేసుకుంది. విజేతలకు సర్పంచ్ తో పాటు వార్డు మెంబర్లు బహుమతి ప్రధానం చేశారు. ముగ్గుల పోటీలలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి సర్పంచ్ వాగుల్ దాస్ నిరంజన్ గౌడ్ తన సొంత డబ్బులతో బహుమతులు ప్రధానం చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, వార్డు సభ్యులు, గ్రామ పంచాయతీ సిబ్బంది, మహిళలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు