నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
ముంబయి: స్టాక్ మార్కెట్లు నేడు నష్టాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 213 పాయింట్లు కోల్పోయి 29,381 వద్ద, నిఫ్టీ 74 పాయింట్లు కోల్పోయి 8,963 వద్ద ముగిశాయి. సన్ఫార్మా, డీఎల్ఎఫ్, ఐటీసీ, భారతీ ఎయిర్టెల్, హెచ్సీఎల్ టెక్ తదితర షేర్లు లాభాలు ఆర్జించాయి. సెసా స్టెర్లైట్, ఎన్ఎండీసీ, బ్యాంక్ ఆఫ్ బరోడా, హిందాల్కో, కెయిర్న్ ఇండియా తదితర షేర్లు నష్టాలు ఎదుర్కొన్నాయి. డాలర్తో రూపాయి మారకం విలవు రూ. 62.13 ఉంది.