నాయి బ్రాహ్మణ సేవా సంగం కమిటీ ఎన్నిక

రాజోలి 21అక్టోబర్ (జనం సాక్షి)
నాయి బ్రాహ్మణ సేవా సంగం రాజోలి మండల నూతన కమిటీని శుక్రవారం ఎన్నుకున్నారు. మండల కేంద్రం రాజోలిలోని వైకుంఠ నారాయణ స్వామి ఆలయంలో జిల్లా అధ్యక్షుడు భగీరథ వంశీ,ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో జరిగిన ఈ కమిటీ ఎన్నికల్లో నూతన సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడు గా పెద్ద రాఘవేంద్ర, అధ్యక్షుడు గా ఎంపీ రాజు,ఉపాధ్యక్షులుగా పరమేష్, వెంకట్రముడు ,ప్రధాన కార్యదర్శి గా చంద్ర శేఖర్,ఉప కార్యదర్శిగా కుపేంద్ర, కోషది కారి గా హరి,ప్రచార కార్యదర్శిగా మోహన్ లతో పాటు కార్యవర్గ సభ్యులు ను ఎన్నుకున్నారు. సంఘం అభివృద్ధి కి కృషి చేస్తామని నూతన కమిటీ సభ్యులు తెలిపారు