నాలుగవ తరగతి ఉద్యోగుల సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా నల్లబెల్లి రమాదేవి

భూపాల్ పల్లి ప్రతినిధి అక్టోబర్ 17 జనం సాక్షి: తెలంగాణ పంచాయతీ రాజ్ నాలుగవ తరగతి మహిళా ఉద్యోగుల సంఘం కు సోమవారం ఖైరతాబాద్ జిల్లా పరిషత్ పాఠశాలలో తెలంగాణ పంచాయతీ రాజ్ మినిస్టర్ రియల్ ఉద్యోగుల రాష్ట్ర సంఘం అధ్యక్షులు ఏపాల సత్యనారాయణ రెడ్డి, నాలుగవ తరగతి ఉద్యోగుల సంఘం రాష్ట్ర  అధ్యక్షులు మర్రి యాదయ్య గౌడ్ ఆధ్వర్యంలో ఎన్నిక జరిగింది. నాలుగవ తరగతి ఉద్యోగుల సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా నల్లబెల్లి రమాదేవి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని  జయశంకర్ భూపాలపల్లి జిల్లా నాలుగవ తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎండి రహీముద్దీన్,  బి మొండయ్యలు   ఒక ప్రకటనలో తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని భూపాలపల్లి మండలంలోని పుల్లూరు రామయ్య పల్లి గ్రామానికి  చెందిన నల్లబెల్లి రమాదేవి ఎం.పీ.

 యు.పి.ఎస్. ఆఫీస్ సబ్ ఆర్డినేటర్ గా పనిచేస్తున్న రమాదేవి రాష్ట్ర అధ్యక్షురాలుగా ఎంపిక కావడం ఎంతో సంతోషదాయకమన్నారు. ఆమె ఎన్నికకు సహకరించిన రాష్ట్ర, జిల్లా, మండల నాలుగవ తరగతి  ఉద్యోగుల సంఘం నాయకులకు ధన్యవాదములు కృతజ్ఞతలు తెలియజేశారు. నాలుగో తరగతి  మహిళా ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలుగా నా ఎన్నిక కు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు రమాదేవి తెలియజేశారు.