నాల్గవరోజు గాయత్రిదేవి అలంకరణలో భక్తులకు దర్శనం

ఇటిక్యాల (జనంసాక్షి) సెప్టెంబర్ 29 దేవి శరన్న నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మండల పరిధిలోని బీచుపల్లి పుణ్యక్షేత్రంలో శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో నాల్గవరోజు శ్రీ గాయత్రిదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అలాగే శ్రీ కోదండరామస్వామి ఆలయంలో ఉన్న శ్రీ జ్ఞాన సరస్వతిదేవికి సంతానలక్ష్మి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా తిమ్మాపురం, కొండపేట, యాక్తాపూర్, ఎర్రవల్లి చౌరస్తా, షేక్ పల్లి, కొండేరు తదితర గ్రామాల నుంచి భక్తులు బీచుపల్లి పుణ్యక్షేత్రానికి చేరుకొని దక్షిణవాహిని అయినా పవిత్ర కృష్ణానదిలో పుణ్యస్నానాల ఆచరించి నదితీరాన వెలసిన శివాలయం, కోదండరామస్వామి, అభయ ఆంజనేయస్వామి ఆలయాలతో పాటు కొలువుదీరిన అమ్మవార్లను భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు.