: నా సింగాయిపల్లి గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించాలి. మా గ్రామ సమస్యలు పరిష్కరించాలి.

కోడేరు (జనం సాక్షి )ఆగస్టు 18 నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజక వర్గం కోడేరు మండలంలో గల 22 గ్రామ పంచాయతీలలో  రాజాపూర్ గ్రామాన్ని లేదా సింగాయిపల్లి  గ్రామాన్ని  మండల కేంద్రంగా ప్రకటించాలని కోరుతూ సింగాయిపల్లి గ్రామానికి సింగిల్ విండో మార్కెటింగ్ గోదాం ప్రారంభోత్సవం చేయడానికి వచ్చిన కొల్లాపూర్  ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డికి సింగాయిపల్లి గ్రామ యువకులు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మా గ్రామాలను ఏదులలో కలపడానికి మేము సిద్ధంగా లేమని ఎట్టి పరిస్థితుల్లో మా గ్రామాలను సింగయపల్లి లేదా రాజాపూర్ లను మండల కేంద్రంగా ప్రకటించాలని లేనియెడల నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని కోడేరు మండలంలో కొనసాగుతామని డిమాండ్ చేస్తూ అదేవిధంగా నూతనంగా కొనసాగుతున్న సొంత బజారులో ఐమాక్స్ లైట్లు అమర్చాలని విజ్ఞప్తి చేశారు. గ్రామపంచాయతీ భవనం మరియు బీసీ కమిటీ హాల్ పూర్తిగా నిర్మాణం చేయాలని పలు సమస్యలతో కూడిన వినతి పత్రం ను  కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరవాచవర్ధన్ రెడ్డికి సింగాయి పల్లి గ్రామ యువకులు మాచుపల్లి గ్రామ యువకులు వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మల్లేష్ శివ భాను ఈశ్వర్ గ్రామ యువకులు ప్రజలు ఉన్నారు.
a