నిరుపేదకు ఆర్థిక సహాయం అందించిన మార్కెట్ చైర్మన్ మర్రి నారాయణ రావు

కేసముద్రం ఆగస్టు 9 జనం సాక్షి / కేసముద్రం మండలం అర్పనపల్లి గ్రామానికి చెందిన నిలువ నీడలేని నిరుపేద కుటుంబానికి చెందిన టేకుల వీరస్వామి ఇటీవల అనారోగ్యంతో మృతిచెందగా మంగళవారం బాధిత కుటుంబాన్ని కేసముద్రం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మర్రి నారాయణ రావు పరామర్శించి 5000/_ రూపాయల నగదు మరియు 50 కిలోల బియ్యం అందించారు. పూరి గుడిసెలో జీవితం సాగిస్తూ అకాల మృత్యువాత పడ్డ కుటుంబానికి ఎమ్మెల్యే భానోత్ శంకర్ నాయక్ సహకారంతో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అర్పనపల్లి సర్పంచ్ గంధసిరి స్వరూప సోమయ్య,కేసముద్రం మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ బట్టు శ్రీనివాస్, గ్రామస్ధులు షేక్ ఖాదర్, మోడెం రాజు, టి.ఆర్.ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు షేక్ జాని, మహ్మద్ నబిసాబ్, షేక్ ఆటో జాని, పిట్టల సుధాకర్, గంధం శ్రీనివాస్, ఏల్పుగొండ మధుకర్, టేకుల సాయిలు పాల్గొన్నారు