నీళ్లదోపిడీని ఆపండి

` శ్రీశైలం, సాగర్‌ నుంచి ఏపీ తరలింపును నివారించండి
` ఇప్పటికే ఆ రాష్ట్రం వాటాకు మించి కృష్ణాజలాలను వాడుకుంది
` కేఆర్‌ఎంబీకి తెలంగాణ ఫిర్యాదు
హైదరాబాద్‌(జనంసాక్షి): ఇప్పటికే వాటాకు మించి నీటిని ఉపయోగించుకున్న ఆంధ్రప్రదేశ్‌.. శ్రీశైలం, నాగార్జునసాగర్‌ జలాశయం నుంచి నీరు తీసుకోకుండా నిలువరించాలని కృష్ణానదీ యాజమాన్య బోర్డును తెలంగాణ ప్రభుత్వం మరోమారు కోరింది. ఇవాళ తలపెట్టిన బోర్డు ప్రత్యేక సమావేశం వాయిదా పడిన తరుణంలో తెలంగాణ నీటిపారుదలశాఖ ముఖ్యకార్యదర్శి రాహుల్‌ బొజ్జా, ఈఎన్సీ అనిల్‌ కుమార్‌, నాగార్జున సాగర్‌ చీఫ్‌ ఇంజినీర్‌ అజయ్‌ కుమార్‌.. జలసౌధలో కేఆర్‌ఎంబీ ఛైర్మన్‌ అతుల్‌ జైన్‌ను కలిశారు.రాష్ట్ర ప్రభుత్వం తరపున రాహుల్‌ బొజ్జా.. బోర్డుకు లిఖితపూర్వకంగా లేఖ అందించారు. ఏపీ ఇప్పటికే వాటాకు మించి నీటిని వాడుకొందన్న తెలంగాణ అధికారులు.. ఇక నుంచి ఉమ్మడి జలాశయాల నుంచి ఏపీ నీటిని తీసుకోరాదని తెలిపారు. శ్రీశైలం, నాగార్జున సాగర్‌ నుంచి ఏపీ నీటిని తీసుకోకుండా నిలువరించాలని డిమాండ్‌ చేశారు. మే నెల వరకు తెలంగాణకు 107 టీఎంసీల నీరు ఇవ్వాలని బోర్డుకు ఇండెంట్‌ ఇచ్చారు. ఇవాళ జరగాల్సిన ప్రత్యేక సమావేశాన్ని సోమవారానికి వాయిదా వేయాలని ఆంధ్రప్రదేశ్‌ కోరినందున, ఆ రోజు సమావేశంలో చర్చించే వరకు శ్రీశైలం, సాగర్‌ నుంచి ఏపీ నీటిని తీసుకోకుండా చూడాలని తెలంగాణ అధికారులు కోరారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి పదేపదే విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ బోర్డు తగిన విధంగా స్పందించడం లేదని తెలంగాణ అధికారులు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. కేంద్ర మంత్రి నుంచి ఆదేశాలు వచ్చినప్పటికీ అమలు చేయడం లేదని వ్యాఖ్యానించినట్లు సమాచారం.

 

కృష్ణా యాజమాన్య బోర్డు భేటీ వాయిదా
ఎపి హాజరకాక పోవడంతో నిర్ణయం
హైదరాబాద్‌(జనంసాక్షి):కృష్ణా నది యాజమాన్య బోర్డు ప్రత్యేక, అత్యవసర సమావేశం వాయిదా పడిరది. సమావేశానికి తాము హాజరుకాలేమని, వాయిదా వేయాలని ఏపీ అధికారులు కోరారు. దీంతో సమావేశాన్ని సోమవారానికి బోర్డు వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో సోమవారం మధ్యాహ్నం 3.30 గంటలకు సమావేశం జరుగనుంది. ఈ మేరకు రెండు రాష్టాల్రకు సమాచారం అందించామని అధికారులు వెల్లడిరచారు. కాగా, శ్రీశైలం, నాగార్జున సాగర్‌ నుంచి కృష్ణా నీటిని ఆంధప్రదేశ్‌ ప్రభుత్వం అక్రమంగా తరలిస్తున్నదని, వెంటనే అడ్డుకోవాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి కేఆర్‌ఎంబీకి ఫిర్యాదు చేశారు. రెండు ప్రాజెక్టుల పరిధిలో 35 చోట్ల టెలిమెట్రీ పరికరాలు ఏర్పాటు చేయాలని కోరారు. దీంతో బోర్డు చైర్మన్‌ అతుల్‌ జైన్‌ అధ్యక్షతన శుక్రవారం మధ్యాహ్నం సమావేశం ఏర్పాటు చేసింది. అయితే ఏపీ విజ్ఞప్తితో సమావేశం వాయిదాపడిరది. అయితే కృష్ణా, గోదావరి జలాలను ఏపీ తరలించుకుపోతున్నా కాంగ్రెస్‌ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడటం లేదంటూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌ రావు విమర్శించిన విషయం తెలసిందే. 666 టీఎంసీలకు గాను ఏపీ ఇప్పటికే 657 టీఎంసీలను వినియోగించుకున్నదని, తెలంగాణకు 343 టీఎంసీలకు గాను 220 టీఎంసీలు మాత్రమే వినియోగించుకోవడం ప్రభుత్వ అసమర్ధతేనని మండిపడ్డారు. ఇప్పటికైనా సర్కారు కండ్లు తెరిచి రైతుల పంటలు కాపాడలంటే తక్షణమే కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాలన్నారు. ఆంధప్రదేశ్‌కు నీటి విడుదలను వెంటనే బంద్‌ చేయించాలని డిమాండ్‌ చేశారు.