నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే కూనంనేని

 

జూలూరుపాడు, ఆగష్టు 12, జనంసాక్షి: జర్నలిస్ట్ భూక్యా రత్నకుమార్, శివకుమారి దంపతుల కుమార్తె సౌజన్య, నరేందర్ వివాహం స్తానిక ఫంక్షన్ హాల్లో శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కొత్తగూడెం మాజీ శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు, సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. వీరితో పాటు సిపిఐ పార్టీ వైరా నియోజకవర్గ నాయకురాలు బానోతు విజయభాయి, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చండ్ర నరేంద్ర కుమార్, సిపిఐ మండల కార్యదర్శి గుండెపిన్ని వెంకటేశ్వర్లు, సహాయ కార్యదర్శులు గార్లపాటి వీరభద్రం, చాంద్ పాషా, ఎఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి నాగుల్ మీరా, నాయకులు చింత స్వరాజ్యరావు, ఎల్లంకి మధు, పగడాల అఖిల్, గుండెపిన్ని మధు, వెంకటేశ్వర్లు, గుడిమెట్ల సీతయ్య, కొండా వీరయ్య, పసుపులేటి పవన్, సమీర్ పలువురు నూతన వధూవరులను ఆశీర్వదించారు