నెల రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని కోరాం : కిషన్‌రెడ్డి

న్యూఢిల్లీ: తెలంగాణపై నెల రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని కేంద్రాన్ని కోరినట్లు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి కోరారు. ఈ భేటీలో కాంగ్రెస్‌ ప్రతినిధులు రెండు అభిప్రాయాలు చెప్పారని తెలిపారు. వైకాపా ఎలాంటి అభిప్రాయాన్ని చెప్పలేదని ఎంఐఎం మాత్రం ఉంటే కలిసి ఉండాలని లేకపోతే రాయల తెలంగాణ ఏర్పాటు చేయాలని చెప్పిందని తెలియజేశారు.