నేటి నుంచి జైట్లీ లండన్ పర్యటన

న్యూఢిల్లీ:

కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ నేటి నుంచి మూడు రోజుల పాటు లండన్ లో పర్యటించనున్నారు. శనివారంనాడు ఆయన లండన్ లోని పార్లమెంట్ స్వేర్ లోని మహాత్మాగాంధీ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. పర్యటనలో భాగంగా బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరూన్ తో, అదేవిధంగా బ్రిటిష్ ప్రతినిధి, కోశాగార ఛాన్సలర్ జార్జ్ అన్బార్న్ తో ఆయన భేటీ కానున్నారు. ద్వైపాక్షిక, ఆర్థిక సమస్యలతో పాటు రెండు దేశాల్లో ఉన్న అవకాశాలు, ఆర్థిక పరిస్థితులపై వీరు చర్చించనున్నారు.