నేటి నుంచి మూడు రోజులపాటు ఏకశిలా సాయి మందిరంలో గురు పౌర్ణమి ఉత్సవాలు

రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం, జులై 11 (జనంసాక్షి):- నేటి నుంచి ఈ మూడురోజులపాటు గురు పౌర్ణమి  ఉత్సవాలు జరగనున్నట్లు ఆలయ నిర్వాహకులు మడుపు శ్రీరమ్య వేణుగోపాలరావు సోమవారం పేర్కొన్నారు. నియోజకవర్గ పరిధిలో  ఖానాపూర్ వద్ద కొలువైయున్న సద్గురు సాయినాథ్ ఏకశిలా మందిరము నందు గురుపౌర్ణమి ఉత్సవాల సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు  వారు పేర్కొన్నారు.  అభిషేకాలు, మూడు రోజు లపాటు అన్నదాన కార్యక్రమ నిర్వహణతోపాటు ప్రతి రోజు స్వామి వారికి పంచామృత అభిషేఖం నిర్వహించబడుతుందన్నారు. నిత్యం దూపదీప నైవేద్యాలతో ప్రతి గురువారం వందాలది మంది భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహింపబడుతున్నదని భక్తుల పాలిట కొంగు బంగారమైన ఈ  క్షేత్రము  కోరిన కోరికలు తీర్చే ప్రసిద్ధ పుణ్య క్షేత్రంగా అలరారుతోందన్నారు. గురుపౌర్ణమి వేడుకలలో భక్తులు, ప్రజలు పాల్గొని స్వామి వారి కృపకు పాత్రలు కావాల్సిందిగా వారు కోరారు