నేడు అబు జుందాల్‌ కోర్టులో హాజరు

ఢిల్లీ: 26/11 దాడుల సూత్రధారి, అష్కరే తొయిబా ఉగ్రవాది సయ్యద్‌ జబీయుద్దీన్‌ అలియాన్‌ అబు జుందాల్‌ను ఢిల్లీ పోలీసులు ఈ రోజు కోర్టులో హాజరు పరచనున్నారు. జూన్‌ 22న అరెస్టయిన జుందాల్‌ కస్టడీ నేటితో ముగియడంతో కోర్టులో హాజరు పరుస్తున్నట్లు పోలీసులు తెలియజేశారు. జుందాల్‌ రిమాండ్‌ను మరో 15 రోజులు పొడిగించాల్సిందిగా కోర్టును కోరినట్లు పోలీసులు వెల్లడించారు.