నేడు ఢిల్లీలో నితీశ్‌కుమార్‌ భారీ ర్యాలీ

న్యూఢిల్లీ : బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ ఢిల్లీలో మద్దతుదారులతో కలిసి నేడు భారీ ర్యాలీని చేపట్టనున్నారు. బీహార్‌కు ప్రత్యేక హోదా, అధిక ఆర్థిక సాయం కోరుతూ జేడీయూ రాంలీలా మైదానంలో ఈ ర్యాలీని నిర్వహించనుంది, ఈ కార్యక్రమంలో నితీశ్‌పాటు ఇతర పార్టీ నేతలు కూడా పాల్గొననున్నారు. గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్రమోడీకి ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షమైన జేడీయూ నేత నితీశ్‌కుమార్‌ ఢిల్లీలో ఈ ర్యాలీ ద్వారా బల ప్రదర్శనకు సిద్ధమవుతున్నారని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు.