నేడు హైదరాబాద్‌కు అక్బరుద్దీన్‌

– ఉదయం నిర్మల్‌ కోర్టుకు

హాజరుహౖదరాబాద్‌, జనవరి 6 (జనంసాక్షి) :
వివాదాస్పద వ్యాఖ్యలు చేసి కలకలం సృష్టించిన ఎంఐఎం శాసనసభ పక్షనేత అక్బరుద్దీన్‌ ఓవైసీ సోమవారం ఉదయం మూడు గంటలకు హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. లండన్‌ నుంచి ఆయన ప్రత్యేక విమానంలో శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రాయానికి చేరుకుంటారు. ఈ సందర్భంగా ఎయిర్‌పోర్ట్‌ వద్ద పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అనంతరం ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్‌ నుంచి బయలుదేరి ఆదిలాబాద్‌ జిల్లా కోర్టుకు హాజరవుతారు. ఆయన రాక సందర్భంగా నిర్మల్‌ పట్టణమంతా ఖాకీలమయమైంది. పోలీసులు బందోబస్తు చర్యలు పటిష్టం చేశారు.

తాజావార్తలు