నేనిప్పుడు ఆరోగ్యంగా ఉన్నా:కేజ్రీవాల్

Fresh n Fit Says Arvind Kejriwal

న్యూఢిల్లీ: తాను ఇప్పుడు పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. షుగర్,హైబీపీ, తీవ్రమైన దగ్గు వంటి సమస్యలతో బాధపడుతున్న కేజ్రీవాల్ ప్రకృతి చికిత్స నిమిత్తం 10 రోజులపాటు బెంగళూరుకు వెళ్లిన విషయం తెలిసిందే. ప్రకృతి వైద్యాన్ని విజయవంతంగా పూర్తిచేసుకున్న కేజ్రీవాల్ ఇవాళ ఢిల్లీకి వస్తున్న నేపథ్యంలో మీడియతో మాట్లాడుతూ ‘నేను ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నా.. ప్రస్తుతం షుగర్ లెవల్స్, దగ్గు అదుపులో ఉన్నాయి. 10 రోజుల చికిత్స అనంతరం ఢిల్లీకి తిరిగి వెళ్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. రాష్ట్ర పాలనలో భాగస్వామ్యమయేందుకు తిరిగి ఢిల్లీ వెళ్తున్నందుకు ఎంతో ఉద్వేగంగా ఉంది. తాను చికిత్స కొనసాగుతున్నన్నీ రోజులు ఢిల్లీ గురించే ఆలోచించాను. ఢిల్లీలో విద్య,ప్రజా పంపిణీ వ్యవస్థను మెరుగుపరిచేం విషయమై మనీష్‌సిసోడియాతో చర్చించా. ఢిల్లీ పాలన అంశంపై కొన్ని ప్రణాళికలు రూపొందించా. వాటిని త్వరలోనే ప్రకటిస్తానని’ వెల్లడించారు.