నేను సైకిల్‌పై ఆఫీసుకు వెళ్తా

5
– జనవరి 22న కార్‌ఫ్రీ డే

– ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వచ్చే జనవరి 22న ‘కార్‌ ఫ్రీ డే’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రకటించారు. ఈ రోజు తాను సైకిల్‌పై ఆఫీసుకు వెళతానని చెప్పారు. ఆదివారం ‘కార్‌ ఫ్రీ డే’ భాగంగా ఢిల్లీలోని ద్వారక ప్రాంతంలో జరిగిన ఓ కార్యక్రమంలో అరవింద్‌ కేజ్రీవాల్‌ పాల్గొన్నారు. కేజ్రీవాల్‌ ఆధ్వర్యంలో సైకిల్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్‌ మాట్లాడుతూ.. ‘జవనర్‌ 22న ఉద్యోగులు కార్లలో బదులుగా సైకిళ్లు లేదా ప్రజా రవాణా వాహానాల్లో ఆఫీసులకు వెళ్లాలని విన్నవిస్తున్నా. ఆ రోజు నేను కూడా సైకిల్‌పై ఆఫీసుకు వెళతా. నా విన్నపాన్ని కనీసం 5-10 శాతం మంది పాటించినా అది మాకు గొప్ప విజయం’ అని చెప్పారు. ఢిల్లీలో సైకిల్‌

ట్రాక్‌లు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలిపారు. ప్రస్తుతం ఢిల్లీ ప్రభుత్వం ప్రతి నెలా 22న ఒక్కో ప్రాంతంలో కార్‌ ఫ్రీ డే కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.