నేపాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

i54teuuyనేపాల్‌: నేపాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టూరిస్టు బస్సు బోల్తా పడి 17 మంది దుర్మరణం చెందారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రులకు తరలించారు. చికిత్స పొందుతున్న వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.