నైజీరియా టెర్రరిస్టు దాడిలో ఇద్దరు భారతీయుల మృతి

న్యూఢిలీ ): నైజీరియాలోని సమస్యాత్మక మైడుగురి నగరంలో ఒక ప్యాక్టరీపై ఇస్లామిక్‌ మిలిటెంట్లు దాడి చేయటంతో ఇద్దరు భారతీయులు మరణించారు. సైనిక ప్రతినిధి లెప్టినెంట్‌ కల్నల్‌ సాగరి ముసా పిటిఐతో మాట్లాడుతూ గురువారం ఉదయం సుమారు 10 గంటలకు మైడుగురి మెట్రోపాలిస్‌ వద్ద ఉన్న ఒక గమ్‌ అరబిక్‌ ప్యాక్టరీపై తీవ్రవాదులు దాడి చేసినట్లు చెప్పారు. భారీగా వర్షం కురుస్తున్నప్పటికీ ఈ దాడి జరిగిందన్నారు. వీరిని బోకో హరామ్‌ ఇస్లామిక్‌ మిలిటెంట్లుగా అనుమానిస్తున్నామన్నారు. ప్యాక్టరీని దోచుకుందామని వీరు దాడి చేసినప్పటికీ కేవలం 450 డాలర్లు మాత్రమే వారికి దక్కాయని చెప్పారు. నైజీరియాలో ఇస్లామిక్‌ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని వీరు పోరాటం చేస్తున్నారు. వీరు తమ దాడులలో తరచూ బాంబులు, తుపాకులు, ఆత్మాహుతి దళాలను వినియోగిస్తున్నారు. ఈ దేశంలో క్రైస్తవులు, ముస్లింలు సమ సంఖ్యలో ఉన్నారు.