దిల్లీ: న్యూజిలాండ్ ప్రధాని జాన్కీ భారత పర్యటన కొనసాగుతోంది. భారత్ చేరుకున్న జాన్కీకి రాష్ట్రపతి భవన్ వద్ద ప్రధాని నరేంద్రమోదీ ఘనస్వాగతం పలికారు. మంత్రివర్గ సహచరులు, ఉన్నతాధికారులను జాన్కీకి మోదీ పరిచయం చేశారు. అనంతరం న్యూజిలాండ్ ప్రధాని రాజ్ఘాట్కు వెళ్లి గాంధీజికి నివాళులర్పించారు. భారత్ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. కొచ్చిలో న్యూజిలాండ్ చేపడుతున్న అంతర్జాతీయ టెర్మినల్ను జాన్కీ పరిశీలించనున్నారు.