పంజాబ్లో భారీ చోరీ
పంజాబ్లో భారీ చోరీ జరిగింది. ఏటీఎంలో డబ్బులు వేసేందుకు వెళ్తున్న బ్యాంక్ వ్యాన్ పై కొందరు దుండగులు దాడి చేసి, కోటీ 34 లక్షల రూపాయలు దోచుకెళ్లారు. మోహాలీ జిల్లాలోని దురెలాలో ఈ ఘటన జరిగింది. యాక్సిస్ బ్యాంక్కు చెందిన వ్యాన్ ను నిర్మానుశ్య ప్రదేశంలో ఆపిన దుండగులు…డ్రైవర్ సహా సిబ్బంది కళ్ల లో కారం కొట్టారు. తర్వాత వ్యాన్లో ఉన్న సీసీ టీవీ కెమెరాను ధ్వంసం చేసి డబ్బు దోచుకెళ్లారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. విచారణ జరుపుతున్నామని, త్వరలోనే దొంగలను పట్టుకుంటామని పోలీసులు చెప్పారు.