పంటలను పరిశీలించిన వ్యవసాయ అధికారులు

చౌడాపూర్, ఆగస్టు 10( జనం సాక్షి): వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండల కేంద్ర పరిధిలోని మరికల్ గ్రామంలో వాన కాలంలో వేసిన పంటలను ఏ డి ఏ లక్ష్మి కుమారి మరియు ఏఈఓ భావన పరిశీలించి పంటల వివరాలను నమోదు చేసుకోవాలని రైతులకు సూచించారు. అదేవిధంగా అధిక సాంద్రత ప్రత్తి మరియు వెదజల్లే వరి పంటలకు ఎరువుల వాడకం మరియు కలుపు తీసే విధానం గురించి రైతులకు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇంకా ఎవరైనా రైతులు రైతుబీమా, పిఎం కిసాన్ ఈ కేవైసీ చేసుకొని వారు చేసుకోవాలని సూచించారు.