పండగ వేళ ఉక్రెయిన్పై విరుచుకుపడ్డ రష్యా..
` సుమీ నగరంపై క్షిపణుల దాడి
` ఘటనలో 20 మందికిపైగా మృతి
కీవ్(జనంసాక్షి): ఉక్రెయిన్పై రష్యా మరోసారి విరుచుకుపడిరది. సుమీ నగరంపై జరిపిన క్షిపణుల దాడిలో 20 మందికిపైగా మృతి చెందారు. స్థానిక తాత్కాలిక మేయర్ ఆర్టెమ్ కొబ్జార్ ఈ వివరాలను వెల్లడిరచారు. మట్టల ఆదివారం సందర్భంగా స్థానికులంతా ఒకచోట చేరిన వేళ రెండు క్షిపణి దాడులు జరిగాయని తెలిపారు. పండగ వేళ మహా విషాదం చోటుచేసుకుందని సామాజిక మాధ్యమాల వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ మౌలిక సదుపాయాలపై దాడుల నిలిపివేతకు అమెరికా మధ్యవర్తిత్వం వహించిన తాత్కాలిక ఒప్పందాన్ని ఉల్లంఘించారని రష్యా, ఉక్రెయిన్ అగ్ర దౌత్యవేత్తలు పరస్పరం ఆరోపించుకున్న వేళ దాడులు చోటుచేసుకున్నాయి. సుమీ నగరంపై దాడులను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తీవ్రంగా ఖండిరచారు. సాధారణ పౌరులను లక్ష్యంగా చేసుకున్నారని, ఈ దాడుల్లో నివాస భవనాలు, విద్యాసంస్థలు, కార్లు వంటివి ధ్వంసమయ్యాయని మండిపడ్డారు. పదుల సంఖ్యలో పౌరులు మృతి చెందారని చెప్పారు. ఈ ఘటనపై ప్రపంచ దేశాలు స్పందించాలని డిమాండ్ చేశారు. మాస్కో సరిగ్గా ఇటువంటి ఉగ్రచర్యలనే కోరుకుంటోందని, యుద్ధాన్ని లాగుతోందని ఆరోపించారు. రష్యాపై ఒత్తిడి లేకుండా.. శాంతి స్థాపన అసాధ్యమన్నారు. మాస్కో విషయంలో చర్చలు ఎప్పుడూ క్షిపణులు, వైమానిక దాడులను నిలువరించలేకపోయాయని, ఓ ఉగ్రవాదితో ఏ విధంగా వ్యవహరిస్తారో.. రష్యా పట్ల అటువంటి వైఖరి అవసరమన్నారు.