పదవ బెటాలియన్ లో వ్యాసరచన పోటీలు

ఇటిక్యాల (జనంసాక్షి) అక్టోబర్ 22 పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో భాగంగా రెండవ రోజు శనివారం వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీచుపల్లి పదవ బెటాలియన్ కమాండెంట్ రామ్ ప్రకాష్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బందికి వ్యాసరచన పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ నాగభూషణం, ఆర్ఐలు రాజారావు, రాజేష్, రమేష్ బాబు, శ్రీధర్ తదితర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.