*పదో తరగతి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేసిన మక్తల్ ఎమ్మెల్యే .చిట్టెం రామ్మోహన్ రెడ్డి 💐💐*

ఈ రోజు తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి శ్రీమతి సబితా ఇంద్రసేనారెడ్డి పదో తరగతి ఫలితాలను విడుదల చేశారు.ఇట్టి ఫలితాల్లో పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థిని విద్యార్థులు,వారి తల్లిదండ్రులకు పేరు పేరున మక్తల్ శాసనసభ్యులు చిట్టెం రామ్మోహన్ రెడ్డి హార్థిక శుభాకాంక్షలు* తెలియజేశారు.

చిత్తశుద్ధితో చదివి మంచి మార్కులతో రాష్ట్రంలోనే మక్తల్ ప్రాంతానికి మంచి పేరు తీసుకురావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.అదేవిధంగా పదో తరగతి ఫలితాల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు కృంగిపోకుండా మరింత పట్టుదలతో చదివి వచ్చే సప్లమెంటరీ ఫలితాల్లో ఉత్తీర్ణులు కావాలని ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యరంగానికి ప్రాధాన్యత ఇస్తుందని తెలియజేశారు.సీఎం కేసీఆర్ ప్రభుత్వం ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థల్లో కల్పిస్తున్న సౌకర్యాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు..