పరిసరాల పరిశుభ్రత

కొండపాక (జనంసాక్షి) సెప్టెంబర్ 15; రోగాల బారిన పడకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రత పాటించాలని మంగోల్ సర్పంచ్ కిరణ్ కుమార్ చారి అన్నారు . జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవము సందర్భముగా  సిద్దిపేట జిల్లా కొండపాక మండలములోని మంగోల్ గ్రామములో నీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల , ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు   నులి పురుగుల మందు ను పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు నులి పురుగుల మందు ను పంపిణి చేయడం జరిగింది అన్నారు.               ప్రతి విద్యార్థి నులి పురుగుల మందును మింగలని సూచించారు. నులి పురుగులు ఉన్న వారు  రక్త హీనత తో పాటు శారీరకంగా మానసికముగా మంద కొడిగా ఉంటారని తెలిపారు .విధ్యారుతుల్ ఆరోగ్యముగా ఉన్నప్పుడే అనుకున్న లక్ష్యాలు సాధిస్తారని తెలిపారు. తధానుతరం గ్రామం లో నీ రెండు అంగన్వాడీ కేంద్రాలలో విధ్యరుతులకు పలకలు పంపిణీ చేశారు.