పలు అభివృద్ధి పనులను పరిశీలించిన డిపిఓ

మండల పరిధిలోని ఏదుట్ల గ్రామంలో పలు అభివృద్ధి పనులను డిపిఓ సురేష్ కుమార్ పరిశీలించారు మొదటగా గ్రామపంచాయతీలోని ఆడిట్ రికార్డులను తనిఖీ చేసి ఎప్పటికప్పుడు  జి పి పనులను సంబంధించి రికార్డులను నమోదు చేయాలనీ పంచాయతీ కార్యదర్శి సర్పంచ్ లకు సూచించారు గ్రామంలోని నర్సరీలను, అంగన్ వాడి కేంద్రాలను, తడి పొడి చెత్త కేంద్రాన్ని పరిశీలించారు ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి  విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని ఉపాధ్యాయులను కోరారు ఈ కార్యక్రమంలో ఎంపీడీవో హుస్సేనప్ప, గ్రామ సర్పంచ్ శ్రీలత, పంచాయతీ కార్యదర్శి  సాదత్ అలీ తదితరులు పాల్గొన్నారు