పల్లేనిద్ర కార్యక్రమం పాల్గొన్న ప్రజా ప్రతినిధులు అధికారులు

శ్రీరంగాపురం, ఆగస్టు 25,( జనంసాక్షి) :
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఆదేశాల మేరకు తాటిపాముల గ్రామంలో బుధవారం సాయంత్రం వజ్ర సంకల్ప పల్లెనిద్ర కార్యక్రమంలో డీపీవో సురేశ్, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. గురువారం ఉదయం మార్నింగ్ వాక్ లో గ్రామం మొత్తం తిరిగి ప్రజలు, ప్రజా ప్రతినిధుల ద్వారా సమస్యలను నోట్ చేసుకున్నారు. మంత్రి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి  పరిష్కారం చేస్తామని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ సత్యమ్మ, ఎంపీటీసీ పార్వతమ్మ, ఉపసర్పంచ్ కురుమన్న, స్కూల్ హెచ్ఎం రామచంద్రయ్య, ఏఎస్సై రాజశేఖర్రెడ్డి, వార్డు మెంబర్లు, ప్రజలు పాల్గొన్నారు.
==================================================================
25ఎస్ఆర్పీ 01 : మార్నింగ్ వాక్ లో ప్రజల వద్ద సమస్యలను తెలుసుకుంటున్న అధికారులు