పశ్చిమబెంగాల్ ప్రభుత్వానికి నోటీసులు

lgr3lj77పశ్చిమబెంగాల్‌లో 72 ఏళ్ల నన్ గ్యాంగ్ రేప్ కేసును జాతీయ మానవ హక్కుల సంఘం సుమోటోగా స్వీకరించింది. ఘటనపై వివరణ ఇవ్వాలంటూ ఆ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. ఈ మేరకు సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించింది. నాలుగు రోజుల క్రితం ఓ ప్రార్ధనా మందిరంలో దోపిడీకి వచ్చిన దొంగలు.. అడ్డుకున్న వృద్ధురాలిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసులు 8 మంది నిందితులను అరెస్టు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.