పశ్చిమ బెంగాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం : 8 మంది మృతి

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లోని కృష్ణానగర్‌ వద్ద జాతీయ రహదారిపై ఈ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ, కారు ఢీకొన్న ప్రమాదంలో కారులోని 8 మంది అక్కడికక్కడే మృతి చెందారు. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు.