పాకిస్తాన్ పై భారత్ గెలవడంతో సంబరాలు

వెంకటాపూర్(రామప్ప)అక్టోబర్23(జనం సాక్షి):-
టి 20 ప్రపంచ కప్ లో ఆదివారం పాకిస్తాన్ తో ఇండియా ఆడిన క్రికెట్ మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగింది.దాయాదుల పోరులో భారత్ గెలవడంతో మండల కేంద్రంలోని చౌరస్తాలో యువజన కాంగ్రెస్ జిల్లా నాయకుడు సిద్దం రాఘవేందర్ ఆధ్వర్యంలో యువకులు బాణసంచా పేల్చితూ సంబరాలు జరుపుకున్నారు.
ఈ కార్యక్రమంలో  మిల్కూరి అయిలయ్య, మామిడిశెట్టి కోటి,మెట్టు సురేష్,అన్నేవేన రాజు,రెడ్డి శ్రీధర్,రెడ్డి రంజిత్, బానోత్ రాహుల్,సాంబరాజు కిరణ్,కోటగిరి నాగరాజు,బ్రహ్మచారి,రాకేష్, శివ తదితరులు పాల్గొన్నారు.
Attachments area