పాక్ కాల్పుల్లో నలుగురు జవాన్ల మృతి
న్యూఢిల్లీ,జూన్13(జనం సాక్షి): జమ్మూకాశ్మీర్ లో పాక్ రేంజర్లు మరోసారి రెచ్చిపోయారు. సాంబా జిల్లా చంబ్లియాల్ సెక్టార్ లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించారు. వారి కాల్పుల్లో నలుగురు జవాన్లు అమరులయ్యారు. మరో ముగ్గురు జవాన్లు గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పాక్ రేంజర్ల కాల్పులకు భారత బలగాలు కూడా ధీటుగా సమాధానం ఇస్తున్నాయి. గత నెల రోజులుగా పాక్ రేంజర్లు ఎల్ వోసీ వెంబడి పదే పదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నారు.