పాక్‌ దుశ్చర్యపై సుప్రీంలో ప్రజాప్రయోజనాల వ్యాజ్యం

న్యూఢిల్లీ : భారత్‌ -పాక్‌ నియంత్రణ రేఖ వద్ద పాక్‌ జవాన్లు ఇద్దరు భారత జవాన్ల తల నరికిన ఘటనపై సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజనాల వ్యాజ్యం దాఖలైంది. పాక్‌ దుశ్చర్యను అంతర్జాతీయ నేరాల న్యాయస్థానంలో లేవనెత్తాలని ఈ పిల్‌లో పిటిషనర్‌ పేర్కొన్నారు. దీనిపై 4 వారాల్లోగా వివరణ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.