పాక్ దాడులను తిప్పికొట్టిన భారత్

99పొరుగుదేశం పాకిస్తాన్ మరోమారి రెచ్చిపోయింది. జమ్ముకాశ్మీర్ పూంచ్ సెక్టార్లో ఆర్మీ దళాలలపై ఆ దేశ భద్రతా దళాలు కాల్పులకు తెగబడ్డారు. వెంటనే స్పందించిన భారత సైనికులు దాడులను తిప్పికొట్టారు. గత వారంరోజుల సమయంలో పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడం ఇది రెండోసారి. ఆగస్టు 14న పాక్ ఆర్మీ జరిపిన కాల్పుల్లో 50 యేళ్ల ఓ మహిళ తీవ్రంగా గాయపడింది. కాగా గడిచిన ఏడాది పాక్ కాల్పుల విరమణను ఉల్లంఘించిన ఘటనలో 16 మంది పౌరులు చనిపోగా 71 మంది గాయపడ్డారు.