పాక్ హై కమిషనర్ కు సమన్లు

ముంబై దాడుల సూత్రధారి లఖ్వీకి పాకిస్థాన్ లోని హైకోర్టు బెయిల్ ఇవ్వడంపై భారత్ అభ్యంతరం తెలిపింది. మన దేశంలో పాకిస్థాన్ హై కమిషనర్ అబ్దుల్ బాసిత్ కు సమన్లు జారీ చేసింది. లఖ్వీ బెయిల్ పొందినా విచారణ కొనసాగుతుందని భారత విదేశాంగ కార్యదర్శి అనిల్ వాద్వా స్పష్టం చేశారు.