పాఠశాల లను సందర్శించిన సర్పంచ్ సురేందర్ యాదవ్

మన ఊరు మన బడి కార్యక్రమం లో భాగంగా పట్టణంలోని పలు పాఠశాలలను సర్పంచ్ సురేందర్ యాదవ్ సందర్శించారు.
పాఠశాలలో చేపట్టిన అనేక అభివృద్ధి పనులను పరిశీలించండం తో పాటు పాఠశాల లో నిర్వహిస్తున్న మధ్యాహ్న భోజనం, అందిస్తున్న విద్య, పిల్లల హాజరు వంటి అంశాలను అడిగి తెలుసుకున్నారు.
అందులో భాగంగా పాటశాలల ఉపాధ్యాయులు మరిన్ని సమస్యలు తెలుపడం తో సానుకులంగా స్పందించి త్వరలో వాటిని పరిష్కరించేందుకు తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమం లో ప్రధానోపాధ్యాయులు అజ్గరి బేగం , పిల్లి కిషన్, కాంప్లెక్స్ హెడ్ మాస్టర్, విలాస్ రెడ్డి,పేరెంట్స్ కమిటీ సభ్యులు మంచికుంఠ సతీశ్,k. రాజు తో పాటు పలువురు ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు .