పాడి రైతులకు సబ్సిడీ లోన్లు పంపిణీ…

ఊరుకొండ, ఆగస్టు 23 (జనం సాక్షి):
హెరిటేజ్ డైరీ ఆధ్వర్యంలో జగబోయినపల్లి పాడి రైతులకు ఆవుల లోన్లు పంపిణీ చేసినట్లు ఎజెంట్ రవి తెలిపారు. మంగళవారం నాగర్ కర్నూల్ జిల్లా ఊరుకొండ మండలం జగబోయిన్ పల్లి గ్రామంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా హైదరాబాద్ రీజియన్ హెడ్ సర్వోత్తమ్ రెడ్డి, మరియు ట్రస్ట్ హెడ్ శ్రీనివాస్ , మిడ్జిల్ ప్లాంట్ మేనేజర్ ఎం.స్వామి గౌడ్ లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రతి రైతుకు రూ.50000/- చొప్పున మొత్తం 20 మంది రైతులకు కలిపి 10 లక్షలు పంపిణీ చేశారు. అనంతరం సర్వోత్తమ్ రెడ్డి మాట్లాడుతూ.. హెరిటేజ్ డైరీలో పాలు పోసే ప్రతి పాడి రైతుకు రెండు లక్షల ఉచిత ప్రమాద బీమా మరియు సబ్సిడీ ద్వారా దాన కాల్షియం మినరల్ మిక్సర్ నట్టల మందులు సబ్సిడీ ద్వారా ఇవ్వడం జరుగుతుంది అని మరియు ఉచిత పశు వైద్య సేవలను హెరిటేజ్ డైరీ పాం రైతులకు అందిస్తుందని తెలిపారు. ప్రతి పాడి రైతు. ఈ యొక్క అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏజెంట్ రవి, పాడి రైతులు మహేష్, యాదయ్య, ఎం.యాదయ్య, సూపర్వైజర్ కార్తీక్, మరియు పాడి రైతులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.