పానుగల్ లో ర్యాపిడ్ యాక్షన్ పోలీసుల కవాతు

పానుగల్ అక్టోబర్ 20(జనంసాక్షి)
 మండల కేంద్రంలో గురువారం ర్యాపిడ్ యాక్షన్ పోలీస్ లు పెద్దఎత్తున కవాతు నిర్వహించారు. అసిస్టెంట్ కమాండెంట్ శశాంక్ శేఖర్, పానుగల్ ఎస్సై నాగన్న ఆధ్వర్యంలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ పోలీసులు పురవీధుల్లో కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షనే ధ్యేయంగా విధులు నిర్వహిస్తూ,అత్యవసర సమయంలో తగిన విధంగా స్పందిస్తూ,అన్నివిధాల సాయం అందిస్తామన్నారు. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ పోలీసులు సమస్యాత్మక ప్రాంతాల్లో అత్యవసర సేవలు అందిస్తారని అన్నారు.సమస్యాత్మకమైన ప్రాంతాలలో ఘర్షణలు మరియు గొడవలు జరిగితే వెంటనే రంగంలోకి దిగి,శాంతిభద్రతలు కాపాడేందుకు ఎల్లప్పుడూ రాపిడ్ యాక్షన్ ఫోర్స్ అందుబాటులో ఉంటుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ రామ్ చందర్, చంద్రశేఖర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.