పార్టీలకు అతీతంగా తెలంగాణ పోరాటం కేసీఆర్‌తో కెకె భేటీ

 

 

హైదరాబాద్‌, నవంబర్‌ 21 : తెలంగాణకోసం పార్టీలకు అతీతంగా పోరాడతామని, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కె.కేశవరావు చెప్పారు. తెలంగాణ సాధనకోసం తెలంగాణవాదులందరిని ఒకే వేదికపైకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన చెప్పారు. తెలంగాణపై తాము కేంద్ర ప్రభుత్వానికో, పార్టీ అధిష్టానానికో గడువు పెట్టబోమని, తమకు తానే గడువు విధించుకుంటామని కేశవరావు చెప్పారు. బుధవారంనాడు ఆయన  టిఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌తో భేటీ  అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తాను పార్టీ మారుతున్నట్లు మీడియాలో వస్తున్న వార్తలను ఖండించారు. తాను పార్టీ మారాల్సిన అవసరం లేదన్నారు. అధిష్టానంపైనే తెలంగాణ కోసం ఒత్తిడి తెస్తామన్నారు. తెలంగాణ