పార్టీ ఫిరాయింపులు, స్పీకర్ పాత్ర పై విద్యార్థులకు ఉపన్యాస పోటీ

అలంపూర్ పట్టణం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల  హరిజనవాడ నందు బుధవారం నడిగడ్డ సోషల్ ఫోరం ఆధ్వర్యంలో పార్టీ ఫిరాయింపుల చట్టం,స్పీకర్ పాత్ర అనే  అంశం పై ఉపన్యాస పోటీని నిర్వహించారు. ఇందులో పదవ తరగతి చదువుతున్న శివ ప్రసాద్ అనే విద్యార్థి మొదటి స్థానం నిలిచి, జిల్లాస్థాయి లో జరుగబోయే ఉపన్యాస  పోటీలకు ఎంపిక అయ్యారు. ఈ కార్యక్రమం లో ప్రధానోపాధ్యాయులు ఆర్. అశోక్ కుమార్, ఉపాధ్యాయులు.బైరోజు రాజశేఖర్, జి.మాబుసాబ్ , బలగం నాగరాజు,జి.నాగరాజు,బషీర్ అహ్మద్,  పాల్గొన్నారు.