పార్థివ దేహానికి పూలమాలవేసి వారి కుటంబసభ్యులకు పరామర్శ

మోత్కూరు సెప్టెంబర్ 15 జనంసాక్షి : అడ్డగూడూరు మండలం రాపాక(డి) గ్రామంలో మాజీ ఉపసర్పంచ్ సూరారం పాపయ్య తల్లి సూరారం రామచంద్రమ్మ మరణించగా పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించి అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపిన టీపీసీసీ సభ్యులు గుడిపాటి నర్సయ్య, ఉమ్మడి నల్గొండ జిల్లా టెలికామ్ అడ్వైజర్ కమిటీ మెంబర్ టీపీసీసీ రాష్ట్ర నాయకులు ఇటికాల చిరంజీవి. అనంతరం ఇటికాల చిరంజీవి వారి కుటుంబ సభ్యులకు రూ.5000 ఆర్థిక సహాయం అందజేశారు. వారితో పాటు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అడ్డగూడూరు మండల అధ్యక్షుడు పోలేబోయిన లింగయ్య యాదవ్, అడ్డగూడూరు మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రాచకొండ రమేష్,మండల నాయకులు బలేంల సురేష్,బొమ్మగాని సైదులు,సూరారం నవీన్, నాయకులు లింగాల సుధాకర్ రెడ్డి,బోనుగా వెంకట్ రెడ్డి,ఆలకుట్ల నర్సయ్య, గొలుసుల గురుమూర్తి, ముక్కముల్ల నర్సయ్య, లింగాల నర్సిరెడ్డి, చిప్పలపల్లి యాదగిరి, బండారి వీరాస్వామి తదితరులు పాల్గొన్నారు.