పార్లమెంట్‌ నుంచి రాష్ట్రపతి భవన్‌కు విపక్ష నేతల పాదయాత్ర

దిల్లీ: భూసేకరణ చట్టంలో మార్పులకు వ్యతిరేకంగా విపక్షాల ఎంపీలు మంగళవారం సాయంత్రం పార్లమెంట్‌నుంచి రాష్ట్రపతి భవన్‌కు పాదయాత్ర చేపట్టారు. 11 విపక్ష పార్టీలు పాల్గొన్న ఈ ర్యాలీకి కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ నాయకత్వం వహిస్తున్నారు.