పాలమూరు రెడ్డి సేవాసమితి నాగర్ కర్నూల్ పట్టణ కమిటీ ఎన్నిక.

అద్యక్షుడిగా దొడ్ల సత్యనారాయణ రెడ్డి,
ప్రధాన కార్యదర్శి దెంది రాజారెడ్డి,
మీడియా సెల్ ఇంచార్జి గా కొండకింది మాధవరెడ్డి.
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,అక్టోబర్ 21(జనంసాక్షి):

నాగర్ కర్నూల్ పట్టణంలోని సీఎన్ రెడ్డి సేవాసదన్ లో శుక్రవారం పాలమూరు రెడ్డి సేవాసమితి ఆధ్వర్యంలో నిర్వహించిన రెడ్డి సేవా సమితి సర్వసభ్య సమావేశం జరిగిం ది.అనంతరం పాలమూరు రెడ్డి సేవా సమి తి పట్టణ కమిటీ ని ఎన్నుకోవడం జరిగింది. నూతనంగా అద్యక్షుడిగా ఎన్నికైన దొడ్ల సత్యనారాయణ రెడ్డి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా తాలూకా అధ్యక్షులు ధ్యాసాని లింగారెడ్డి పాల్గొని మాట్లాడుతూ సంఘం నిర్మాణం చేస్తున్నటువంటి కళ్యాణమండపంపై వివరించడం జరిగింది.తాలూకా ప్రధాన కార్యదర్శి బుసిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ సంఘ నిర్మాణం ఆవశ్యకతను గురించి వివరించారు.కేంద్ర కమిటీ సహాధ్యక్షులు పోతుల శ్యాంసుందర్ రెడ్డి మాట్లాడుతూ గతంలో సంఘం చేసిన కార్యక్రమాలపై వివరించారు. తదుపరి పట్టణ కమిటీ ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఈ ఎన్నికలో అధ్యక్షులు దొడ్ల సత్యనారాయణ రెడ్డి, ప్రధాన కార్యదర్శి దెంది రాజారెడ్డి, కోశాధికారి దయాకర్ రెడ్డి, ఉపాధ్యక్షులు జనార్దన్ రెడ్డి ,శ్రీ వెంకట్ రెడ్డి, కార్యదర్శులు రాజేశ్వర్ రెడ్డి, విశ్వేశ్వర్ రెడ్డి, ప్రచార కార్యదర్శి అమరేందర్ రెడ్డి, మీడియా సెల్ ఇన్చార్జిగా కొండ కింది మాధవ రెడ్డి కార్యవర్గ సభ్యులుగా ప్రేమ్ కుమార్ రెడ్డి, శేఖర్ రెడ్డి , జగదీశ్వర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, గౌరవ సలహాదారులుగా భీమ్ రెడ్డి, శేశిరెడ్డి,చంద్రశేఖర్ రెడ్డి, శేఖర్ రెడ్డి లను ఎన్నుకోవడం జరిగింది జిల్లా గౌరవ అధ్యక్షులు దొడ్ల నారాయణ రెడ్డి నూతన కమిటీని అభినందిస్తూ మాట్లాడుతూ రెడ్డిలు సంఘటితంగా ఉండాలని అది చాలా ఆవశ్యకత అని తెలిపారు. ఈ కార్యక్రమంలో తాలూకా కోశాధికారి నారాయణ రెడ్డి, తాలూకా ఎన్నికల పర్యవేశకులు బాల్ చంద్రా రెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు రాగి శ్రీనివాస్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.