పీఎంవో అధికారులతో గవర్నర్ భేటీ

న్యూఢిల్లీ : ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా పీఎంవో అధికారులతో గవర్నర్ సమావేశమయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితులు, ఉద్యోగుల విభజన సహా పలు అంశాలపై పీఎంవో అధికారులతో గవర్నర్ చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. రెండు రోజుల ఢిల్లీ పర్యటన నిమిత్తం నిన్న గవర్నర్ నరసింహన్ ఢిల్లీ చేరుకున్నారు.