పులితో మోదీ
రాయ్పూర్: ప్రధాని నరేంద్ర మోదీ వైల్డ్లైఫ్ ఫొటోగ్రాఫర్గా మారారు. చత్తీస్గఢ్ రాష్ట్ర అవతరణ వేడుకల్లో పాల్గొనడానికి రాయ్పూర్ వచ్చిన మోదీ.. అక్కడి నందన్ వన్ జంగిల్ సఫారీకి వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడే ఎన్క్లోజర్లో ఉన్న పులిని ఫొటో తీసే ప్రయత్నం చేశారు. పులికి మరీ దగ్గరగా వెళ్లి ప్రధాని ఫొటో తీయడానికి ప్రయత్నించడం విశేషం. ఆయన వెంట చత్తీస్గఢ్ సీఎం రమణ్సింగ్ కూడా ఉన్నారు.