పెంపుడు జంతువులను సంరక్షించాలి జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ సురేఖ

మక్తల్ జూలై 06 (జనంసాక్షి) ప్రపంచ సంక్రమిత వ్యాధుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మక్తల్ పట్టణంలోని పశువైద్యశాలలో పెంపుడు జంతువులకు ఉచిత యాంటీ రేబిస్ టీకాలను వేశారు ఈ కార్యక్రమానికి జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ సురేఖ హాజరై పెంపుడు జంతువుల యజమానులతో సంక్రమిత వ్యాధుల గురించి చర్చించి ఆ వ్యాధుల నుండి  పెంపుడు జంతువులను ఎలా సంరక్షించుకోవాలో మరియు పశువులు, జంతువుల నుండి మనుష్యులకు వ్యాధులు సంక్రమించకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి వివరించారు .ఈ కార్యక్రమంలో పశువైద్యాధికారి డాక్టర్.మిరాజ్ అహ్మద్, వెటర్నరీ అసిస్టెంట్ దివాకర్, సిబ్బంది మరియు పెంపుడు జంతువుల యజమానులు పాల్గొన్నారు